లాలూ కొంపముంచిన నేతలు

 

 

 

రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. ఆర్జెడి పార్టీకి 13మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 9కి పడిపోయింది. ఎమ్మెల్యేలు రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ కి సోమవారం మధ్యాహ్నం అందజేశారు. తాము ఆర్జెడి పార్టీకి మాత్రమే రాజీనామా చేసినట్లు ప్రకటించాలని వారు స్పీకర్ ని కోరగా... స్పీకర్ వారి అభ్యర్థనను వెంటనే అంగీకరించినట్లు సమాచారం. వీరంతా అధికార పార్టీ అయిన జెడియూలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏదో జరుగుతున్నదని తాను విన్నానని, అది నిజమా? కాదా? అనేది ఇంకా తెలియదని ఆర్జేడీ అధినేత లాలూ వ్యాఖ్యానించారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో లాలూ ప్రసాద్ కి ఎమ్మెల్యేల రాజీనామా గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.