గుడి స్థలాన్ని మింగేసిన కాంగ్రెస్ ఎంఎల్ఏ !

 

 

 

 

 

ఎలమంచిలి కాంగ్రెస్ ఎంఎల్ఏ రమణమూర్తి రాజు అలియస్ కన్నా బాబు భూకబ్జా చేసినట్లు అధికారులు తేల్చారు. ఇటీవల సీతమ్మధారలో ఆయన నిర్మించిన అత్యంత విలాసవంతమయిన భవనంలోని సగం భూమి సింహాచలం దేవస్థానానికి చెందినదిగా అధికారుల విచారణలో తేలింది.

 

ఆయన ఆక్రమించిన భూమి విలువ సుమారు ఆరు కోట్లకు ఫైగానే ఉంటుందని సమాచారం. ఈ నాయకుడు భూమి కబ్జాకు పాల్పడ్డాడని జిల్లా అధికారులకు అనేక ఫిర్యాదులు అందడంతో దీనిఫై సమగ్ర విచారణ చేపట్టాలని అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీనిఫై ఆ శాఖ అధికారి నర్సింగరావు దర్యాప్తు చేయడంతో ఎంఎల్ఏ ఘనకార్యం రుజువైంది.

 

మరోవైపు కన్నా బాబు కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణఫై ఏసిబి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అనేక క్రిమినల్ కేసులు కూడా కన్నా బాబు ఫై ఉన్నాయి.