కేసిఆర్ తో విభేధాలు లేవు : రాములమ్మ
posted on Nov 26, 2012 1:28PM
సూర్యపేటలో జరిగిన తెరాస సమరభేరికి విజయశాంతి హాజరుకాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ సభకు తెరాస ఎంపిగా ఉన్న విజయశాంతి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేసిఆర్ కు విజయశాంతికి విభేదాలు వచ్చాయని ప్రచారం ఆరంభమైంది. దీనిపై విజయశాంతి వివరణ ఇచ్చారు. కేసిఆర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, తీవ్ర అస్వస్థతతో బాధ పడుతుండటంతో సమరభేరి సభకు హాజరుకలేకపోయానని చెప్పారు. అంతేకాని తనకు కేసిఆర్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రి ఉన్నపుడు విజయశాంతి తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. కాని రాజశేఖరరెడ్డి మరణించడంతో ఆ ప్రచారానికి తెరపడింది.