‘వై ఎస్ ను మార్కెట్ చేస్తున్న విజయమ్మ, షర్మిలా’

 

 

 

 

అధికారం కోసం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయమ్మ, షర్మిలా దివంగత వై ఎస్ రాజశేఖర రెడ్డి పేరును మార్కెట్ చేసుకొంటున్నారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యానారాయణ విమర్శించారు.

 

కాంగ్రెస్ లో క్రమశిక్షణ కల్గిన నేతగా వై ఎస్ పని చేసేవారని, అలాంటి నేతకు చెడ్డ పేరు వచ్చేలా వీరు కార్యకలాపాలు సాగిస్తున్నారని మంత్రి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా కొత్తపల్లి సుబ్బారాయుడు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న మంత్రి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలఫై తీవ్ర విమర్శలు చేస్తూ, ఆ పార్టీని దొంగల పార్టీగా అభివర్ణించారు.

 

జగన్ పార్టీకి ప్రత్యెక అజెండా అంటూ ఏమీ లేదని, అది దిక్కుమాలిన పార్టీ అని మంత్రి అన్నారు. శాసనసభలో ఎస్సీ, ఎస్టీ ప్లాన్ విషయంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం పార్టీ తో కుమ్మక్కు అయిందని ఇంత కంటే నీతిమాలిన విషయం ఏముంటుందని మంత్రి వ్యాఖ్యానించారు.