టీఆర్ఎస్ నేత కోనపురి రాములు దారుణ హత్య

 

 

 

మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు తమ్ముడు కోనపురి రాములు ఈ రోజు హత్యకు గురయ్యారు. నల్లొండ జిల్లా శివారులోని ఓ ఫంక్షన్ హాలులో జరుగుతున్న పెళ్ళికి హాజరయ్యి తిరిగి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయనను ఆసుపత్రికి తరలింస్తుండగా మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు. రాములు నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు. ఆయనపై గతంలో కూడా హత్యాయత్నం జరిగింది. కొట్టి సాంబశివుడు సోదరుడి హత్య తనకు ప్రాణహానీ ఉందని కోనపురి రాములు గతంలోనే మొరపెట్టుకున్నారు. అతనికి ఇద్దరు గన్‌మెన్లను ఏర్పాటు చేశారు. రాములును హత్య చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని టీఆర్ ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు.