ఏనుగుల బీభత్సం: 10 రోజులు.. 30 మంది..

 

ఏనుగులు మృత్యుదేవతలు అయ్యాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత పది రోజులుగా ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగుల హింసాకాండ కారణంగా ఇప్పటి వరకూ 30 మంది మరణించారు. వందమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని జలపైగురి, డార్జిలింగ్, కూచ్ బీహార్, ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలలోని అడవుల నుంచి ఏనుగులు గ్రామాల మీద దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగులు గుంపులు గుంపులుగా జనావాసాల మీద పడి దాడి చేస్తూ వుండటంతో వాటిని అదుపు చేయడం చాలా కష్టంగా మారింది. ఏనుగుల మందలు ఇప్పటి వరకు 30 మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఈ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఏ సమయంలో ఏనుగుల గుంపులు దాడి చేస్తాయోనని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.