కేసీఆర్ ఇలాకాలో టీడీపీ ముందంజ

 

 

 

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు అనుమానమే అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వెలువడుతున్న మునిసిపల్ ఫలితాలలో టీడీపీ ముందంజలో వుండటం విశేషం. గజ్వేల్ మునిసిపల్ ఫలితాలలో ఇప్పటి వరకూ ఆరు కౌన్సిలర్ స్థానాలకు సంబంధించిన ఫలితాలను వెల్లడించారు. వీటిలో తెలుగుదేశం నాలుగు స్థానాలను సొంతం చేసుకుని ముందంజలో వుంది. మిగిలిన రెండు స్థానాలను ఒకటి కాంగ్రెస్, మరొకటి తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకున్నాయి. ఇక్కడ ఫలితాలు తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూలంగా వుండే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మునిసిపల్ ఫలితాలలోనే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వుందంటే, అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే తరహా ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.