కృష్ణా జడ్పీ బరిలోకి గద్దె అనూరాధ?

 

 

 

ప్రతిష్ఠాత్మకమైన కృష్ణా జిల్లా జడ్పీ పీఠం కోసం తెలుగుదేశం పార్టీ గద్దె అనూరాధను రంగంలోకి దింపేందుకు కసరత్తు జరుగుతోంది. విజయవాడ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ భార్య అయిన అనూరాధ ఎమ్మెస్సీ (బయో కెమిస్ట్రీ) చదివారు. జడ్పీ చైర్మన్ పోస్టుకు పలువురు పోటీలో ఉన్నా, అనూరాధ విద్యావంతురాలు కావడంతో పాటు రాజకీయ కుటుంబానికి చెందిన మహిళ కావడంతో ఆమెకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది.

 

తన భార్యకు జడ్పీ చైర్‌పర్సన్ టిక్కెట్ ఇచ్చినా తనకు మాత్రం తప్పనిసరిగా ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని గద్దె రామ్మోహన్ చంద్రబాబును కోరినట్లు సమాచారం. గతంలో తనకు ఇచ్చిన మాట ప్రకారం విజయవాడ (తూర్పు) సీటును తనకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు సమ్మతిస్తేనే తన భార్య తిరువూరు నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతుందని అంటున్నారు. గతంలో నల్లగట్ల స్వామిదాస్‌కు తిరువూరు ఎమ్మెల్యే సీటు, ఆయన భార్య సుధారాణికి జడ్పీ చైర్‌పర్సన్ పోస్టు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గద్దె ఉదహరిస్తున్నారు.