ఇది మోసాల తెలంగాణ...

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో జరిగిన బహిరంగ సభలో తెదేపా నేత రమేశ్ రాథోడ్ ప్రసంగిస్తూ కేసీఆర్ పై మండిపడ్డారు. చంద్రబాబునాయుడు వల్లే తెలంగాణ వచ్చిందనీ, కేసీఆర్ వల్ల అది రాలేదని వ్యాఖ్యానించారు. రహదారి, విద్యుత్ సౌకర్యాలు తెదేపా హయాంలోనే వచ్చాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పుడు నోరు కూడా మెదపడంలేదు. విద్యార్ధులకు ఉపకార వేతనాలు ఇవ్వడం లేదని ఇది మామూలు 'తెలంగాణ' కాదు 'మోసాల తెలంగాణ' అని చాలా ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం చేతిలో మోసపోతున్న తెలంగాణను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మీద వుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నియమాలను నిలదీయాలని, అందరం కలిసి ఉద్యమించాలని పేర్కొన్నారు.