టాటా నుండి ముగ్గురు ఔట్....

 

టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుండి సైరస్ మిస్త్రీని తొలగించిన సంగతి తెలిసిందే. రతన్ టాటా ప్రస్తుతం తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పుడు మరో ముగ్గురు టాటా గ్రూప్ కి గుడ్ బై చెప్పారు. టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌కు చెందిన బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ మధు కన్నన్‌, వ్యూహకర్త నిర్మాల్య కుమార్‌, చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ ఎన్‌ఎస్‌ రాజన్‌ సంస్థకు గుడ్‌బై చెప్పారు. ముగ్గురు ప్రస్తుతం రాజీనామా చేయగా మరో ఇద్దరిని వేరే విధులకు పంపించారు. వీరిలో బ్రాండ్‌ కస్టోడియన్‌ ముకుంద్‌ రాజన్‌, టైటాన్‌ సీవోవో హర్షాభట్‌ ఉన్నారు.