నన్ను రెచ్చగొడితే నీకే నష్టం: దగ్గుబాటి
posted on Jun 11, 2013 3:49PM
తనను రెచ్చగొడితే సుబ్బరామిరెడ్డికే నష్టమని దగ్గుబాటి వెంకటేశ్వర రావు హెచ్చరిక జారీ చేశారు. మరి ఈయన దగ్గరు సుబ్బిని బెదిరించడానికి ఏ అస్త్రాలు ఉన్నాయో కానీ…ఇలా నాతో పెట్టుకోకు అని బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. ''సుబ్బరామిరెడ్డి పంపించిన లీగల్ నోటీసుల వ్యవహారం నేను కోర్టులోనే తేల్చుకుంటాను. అయినా నాతో వివాదం పొడిగించుకోవడం సుబ్బరామిరెడ్డికే నష్టం. నాతో పెట్టుకోవద్దు..నన్ను రెచ్చగొట్టొద్దు..ఇలాగే చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి” అని కేంద్రమంత్రి పురంధేశ్వరి భర్త, కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. సుబ్బరామిరెడ్డి పంపిన లీగల్ నోటీసులను ఆయన చాలా తేలికగా తీసుకున్నారు. మా ఇద్దరి వివాదం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని, అభ్యర్థుల శక్తి సామర్ధ్యాలను బట్టి ఎన్నికల్లో టికెట్లు వస్తాయని అయన అన్నారు.