సుప్రీంకోర్ట్ లో సమైక్య పిటిషన్ల తిరస్కరణ

 

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై దాఖలైన మూడు పిటిషన్లను సుప్రీంకోర్టు మళ్లీ తిరస్కరించింది. బిల్లు లోక్ సభ పరిధిలో ఉండగా ఎలా జోక్యం చేసుకుంటామని జస్టిస్ దత్ ప్రశ్నించారు. సరైన సమయంలో మళ్లీ పిటిషన్లు వేయాలని, ఇది విభజన వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సరయిన సమయం కాదని న్యాయస్థానం సూచించింది. గతంలో సీనియర్ న్యాయవాదులు వాదించినప్పుడు కూడా ఇదే సమాధానం ఇచ్చామని న్యాయస్థానం వెల్లడించింది. కొద్ది రోజులు క్రితం టీడీపీ నేత పయ్యావుల కేశవ్, బీజేపీ నేత రఘురామకృష్ణం రాజులతో పాటు మరో ఐదుగురు సుప్రీంకోర్టులో పిటీషన్లు వేశారు. పలు అంశాల మీద న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అప్పుడు కూడా సుప్రీంకోర్టు పిటీషన్లను తిరస్కరించింది.