శ్రీకాకుళంలో రెండేసి స్థానాలు పంచుకున్నారు

 

 

 

శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మునిసిపల్ స్థానాల్లో టీడీపీ రెండు స్థానాల్లో గెలవగా, వైకాపా రెండు స్థానాల్లో గెలిచింది. పలాస, పాలకొండ స్థానాలను తెలుగుదేశం గెలుచుకోగా, ఆముదాల వలస, ఇచ్ఛాపురం స్థానాలను వైకాపా సొంతం చేసుకుంది. ఆముదాల వలసలో మొత్తం 23 స్థానాలుండగా కాంగ్రెస్ (3), తెలుగుదేశం (7), వైకాపా (11), ఇతరులు (2) స్థానాల్లో గెలిచారు. ఇచ్ఛాపురంలో 23 స్థానాలుంగా తెలుగుదేశం (8), వైకాపా 13 స్థానాల్లో గెలిచాయి. ఇతరులు రెండు స్థానాలు పొందారు. పలాసలోని 25 స్థానాల్లో తెలుగుదేశం 17 స్థానాల్లో, వైకాపా 8 స్థానాల్లో గెలిచాయి. పాలకొండలోని 20 స్థానాల్లో తెలుగుదేశం 12 స్థానాలు, వైకాపా 3, ఇతరులు 5 స్థానాలు పొందారు.