రైలుకు ఎదురుగా వెళ్ళి...

 

ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వందలాది మంది చూస్తుండగానే వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని చందానగర్, లింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి వద్ద ఉన్న ఐడీకార్డు, ఫోన్ నెంబర్ల ఆధారంగా అతను పనిచేస్తున్న కంపెనీకి సమాచారం అందించారు. సహోద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలానికి చెందిన వెంకట్ రెడ్డి గచ్చిబౌలిలోని డీ ఎస్ టీ వరల్డ్ సాఫ్ట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం వివాహమైన అతడు ..భార్యతో కలిసి మణికొండలో నివాసం ఉంటున్నాడు. వెంకట్ రెడ్డికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియడం లేదని తోటి ఉద్యోగులు తెలిపారు.