శోభా నాగిరెడ్డి మృతి: షాక్‌లో కుటుంబం

 

 

 

భూమా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడాన్ని ఆళ్ళగడ్డ నియోజకవర్గ ప్రజలతోపాటు రాష్ట్రం యావత్తూ జీర్ణించుకోలేకపోతోంది. ఆమె కుటుంబం అయితే షాక్‌లో వుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో వాళ్ళు తల్లడిల్లిపోతున్నారు. శోభా నాగిరెడ్డి పిల్లలు తల్ల మృతదేహం మీద పడి భోరున రోదిస్తున్నారు. శోభ భర్త భూమా నాగిరెడ్డి ఆమెకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి రోదిస్తూనే వున్నారు. ఆమె మరణించినట్టు ప్రకటించినప్పటి నుంచి ఆయన భోరున విలపిస్తున్నారు. ఊహించని షాక్‌కి గురైన ఆయన చాలాసేపు స్పృహతప్పి పడిపోయారు. శోభ తండ్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు ఎస్వీ సుబ్బారెడ్డి తీవ్ర శోకంలో మునిగిపోయి వున్నారు. తన చిన్న కూతురు శోభ గృహిణిగా తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే కాకుండా, రాజకీయాల్లో కూడా రాణిస్తోందన్న సంతోషంలో వున్న తమ జీవితాలను ఈ విషాదం అల్లకల్లోలం చేసిందని ఆయన అన్నారు.