కడియం టీఆర్ఎస్ కోవర్టు
posted on May 11, 2013 3:43PM
కడియం శ్రీహరి ఓ కోవర్టు ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన టీఆర్ఎస్ కు కోవర్టులా పని చేశాడు. ఆయన పార్టీని వీడడం మూలంగా పార్టీకి వచ్చిన నష్టం ఏమీలేదని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా విమర్శించారు. రాజకీయ ప్రయోజనం కోసమే కడియం శ్రీహరి పార్టీని వీడుతున్నారని ఆయన అన్నారు. పక్కా తెలంగాణవాదిని అని చెప్పుకునే కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ తెలంగాణపై అఖిలపక్షానికి ఇచ్చిన లేఖలో ఏమీ లేకపోతే అఖిలపక్ష సమావేశానికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మోత్కుపల్లి నర్సింహులుతో ఏర్పడిన వివాదం కారణంగానే కడియం శ్రీహరి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచే ఆయన తెలుగుదేశం పార్టీని వీడుతారనే ప్రచారం సాగుతోంది. ఇక శ్రీహరి రాజీనామా మీద పార్టీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణకు అడ్డు అని ఇన్నాళ్లు చెప్పిన శ్రీహరి ఇప్పుడు ఆయన వద్దనే చేరి ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేసీఆర్ ఉచ్చులో పడొద్దని, పార్టీకి రాజీనామా విషయంలో పునరాలోచించుకోవాలని కోరారు.