ఇంగ్లాండ్ పై సెహ్వాగ్ దూకుడు

 Sehwag century, Sehwag Gambhir century, Virender Sehwag ends century, england india

 

ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో సెహ్వాగ్ రెచ్చిపోయాడు. వన్డేను తలపిస్తూ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడి సెహ్వాగ్ సెంచరి నమోదు చేశాడు. 90 బంతుల్లో 15 ఫోర్లు ఓ సిక్సర్ తో శతకాన్ని పూర్తి చేశాడు. టెస్టుల్లో రెండేళ్ళ తరువాత సెహ్వాగ్ సెంచరి చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు సెహ్వాగ్, గౌతంగంభీర్ శుభారంభం చేశారు. మొదటి వికెట్ కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.