సీబీఐ వద్దకు రఘునందన రావు
posted on May 21, 2013 6:02PM
టీఆర్ఎస్ బహిష్కృత నేత రఘునందనరావు కేసీఆర్ కుటుంబాన్ని అంత సులభంగా వదిలేలా లేరు. హరీష్ రావు అండ్ కో పై సంచలన ఆరోపణలు గుప్పించిన రఘునందన్.. అంతటితో ఊరుకోకుండా వీటికి సంబంధించిన ఆధారాలతో సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణను కలవాలని నిర్ణయించుకున్నారు. హరీష్తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు అక్రమలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్న రఘునందన్ ఇందుకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను సీబీఐకి ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రఘునందన్పై టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ రఘు రెండు రోజుల క్రితం డీజీపీ దినేష్ రెడ్డిని కలిశారు. తమకు భద్రత కల్పించాలని కోరారు.