ఇండియా 327 ఆలౌట్

 

Pujara century helps India| Pujara century england| Pujara century india| india england 2012

 

ముంబైలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 327 పరుగులకు ఆలౌటైంది. ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ బ్యాట్స్ మెన్ కేవలం 61 పరుగులు మాత్రమే చేశారు. భారత బాట్స్ మాన్ లలో పుజారా ఒంటరి పోరాటం చేసి 350 బంతుల్లో పుజారా 12 ఫోర్లతో 135 పరుగులు చేశాడు. అశ్విన్ పరుగులు చేశాడు. మిగిలిన భారత బాట్స్ మ్యాన్లు ఎవ్వరు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. సెహ్వాగ్ 30, ధోనీ 29, భజ్జీ 21, కోహ్లీ 19, జహీర్ ఖాన్ 11, సచిన్ 8, సెహ్వాగ్ 30, గంభీర్ 4 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో పనేసర్ ఐదు వికెట్లు పడగొట్టగా, స్వాన్ నాలుగు వికెట్లు,ఆండర్సన్ ఒక వికెట్ తీశారు.