ప్రభాస్ మిర్చి రిలీజ్: కేక పెట్టిస్తున్న కటౌట్లు
posted on Feb 8, 2013 10:16AM
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి'సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది. ప్రభాస్ ‘మిర్చి' మూవీ ఈ రోజు విడుదలైన నేపద్యంలో రాష్ట్రంలోని ‘మిర్చి' థియేటర్లన్నీ భారీ కటౌట్లతో నిండిపోయాయి. భీమవరంలోని ప్రభాస్ అభిమానులు 'మిర్చి' భారీ కటౌట్ లు పెట్టి హంగామా చేస్తున్నారు. ఇందులో ఒకటి 150 అడుగుల వెడల్పుతో ఉండగా, మరొకటి 70 అడుగుల పొడవుతో కేక పెట్టిస్తున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ జై (ప్రభాస్) ఇటలీలో ఆర్కిటెక్ ఉద్యోగం చేస్తుంటారు. వీలైతే ప్రేమిద్దాం అనే మనస్తత్వం గల వ్యక్తి. హ్యాపీగా జీవితం గడుపుతున్న అతను ఉన్నట్టుండి ఓ సమస్య కారణంగా ఇండియాకి తిరిగి వస్తాడు. వెన్నెల(అనుష్క), మానస(రీచా గంగోపాధ్యాయ్) లలో జై ఎవరిని ప్రేమించాడు? ఆ సమస్య ఏమిటి? అనేది కథ.
మాటల రచయితగా పరిశ్రమలో మంచి పేరుతెచ్చుకున్న కొరటాల శివ మిర్చి తో తొలిసారిగా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో పాటు,రొమాంటిక్ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. మిర్చి సినిమా టాక్ కొద్ది సేపట్లో మీకోసం.