కేంద్రమంత్రులకు మోడీ సలహా.. లక్ష మంది ఫాలోయర్లు ఉండాలి

 

ప్రధాని మోడీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆయనకి ఉన్న ఫాలోవర్లు సెలబ్రిటీలకు కూడా లేరు అని చెప్పడంలో సందేహమే లేదు. అయితే ఇప్పుడు వారి మంత్రులకు కూడా మోడీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని సూచించారట. అంతేకాదు ప్రతి కేంద్రమంత్రి కనీసం లక్ష మంది ఫాలోయర్లను కలిగి ఉండాలని.. ఎక్కువ పోస్టులు పెట్టాలని.. ఆ పోస్టులు కూడా చదివేవారికి అర్థమయ్యేలా సూటిగా, స్పష్టంగా ఉండాలని సూచించారట. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి.. చేపట్టనున్న పనుల గురించి ఎప్పటికప్పుడు పోస్టులు ఉండాలని చెప్పారంట. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న కేంద్రమంత్రులను అభినందించగా.. లేని వారిపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.