సమైక్యాంధ్రలో ‘జంప్ పితాని’

 

 

 

పార్టీలు మారేవాళ్ళని ఈమధ్యకాలంలో ‘జంప్ జిలాని’ అని ముద్దుగా పిలుస్తున్నారు. ప్రస్తుతం అన్ని పార్టీల్లోనూ జంప్ జిలానీలున్నారు. అదలా వుంచితే ఇప్పుడు ‘జంప్ పితాని’ కొత్త పదం పుట్టడానికి కారణమయ్యారు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. మొన్నటి వరకూ కిరణ్‌కి తోడుగా వుండి, దగ్గరుండి ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ పెట్టించిన పితాని సత్యానారాయణ్ ఇప్పుడు ప్లేటు ఫిరాయించాడు. సమైక్యాంధ్ర పార్టీకి అంత విషయం లేదని గ్రహించేశాడో ఏంటో గానీ, సడన్‌గా ‘జంప్ పితాని’లాగా మారిపోయి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవాలని డిసైడైపోయాడు. అసలే సీమాంధ్రలో ఊహించిన స్థాయిలో జనాదరణ లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న జై సమైక్యాంధ్ర పార్టీకి మరో షాక్ ఇచ్చాడు. వెళ్ళేవాడు కూడా ఒంటరిగా వెళ్ళకుండా తనతోపాటు మాజీ మంత్రి శైలజానాథ్‌ని కూడా తెలుగుదేశం పార్టీకి తీసుకెళ్తున్నాడు. సమైక్య పోరులో మొదటి నుంచీ కిరణ్ కుమార్‌కి తోడుగా వున్న శైలజానాథ్ కూడా జంప్ జిలానీగా మారడం కిరణ్‌కి మింగుడు పడని విషయం. వీళ్ళతోపాటు ఇప్పటికే పార్టీలో ఉన్న అనేకమంది కీలక నాయకులు తెలుగుదేశం పార్టీకి జై కొట్టబోతున్నట్టు సమాచారం అందుతోంది.