కాసేపట్లో వేదికపైకి రానున్న పవన్

 

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో సభ వేదికపైకి వచ్చి కొత్త పార్టీ, విధి విధానాలను ప్రకటించనున్నారు. ఇప్పటికే హైటెక్స్ కు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. వేదిక వద్ద జనసేన పార్టీకి సంబంధించిన విడియో గీతాలను ప్రదర్శిస్తున్నారు. పవన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బిగ్‌స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వేలాది మంది పవన్ కొత్త పార్టీ ప్రకటనను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు. కేవలం నాలుగు వేల మందికే పాస్ లు జారీ చేయడంతో..మిగతా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా అభిమానులు, పోలీసులు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అభిమానులను అదుపు చేశారు.