Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పార్లమెంట్ బడ్జెట్ పై రెండో దశ సమావేశాలు... ఉత్తరాఖండ్ పై యుద్ధానికి పార్టీలు
posted on: Apr 23, 2016 3:11PM

సోమవారం (25/4)నుండి బడ్జెట్ పై రెండో దశ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే ఈసారి మాత్రం ఉత్తరాఖండ్ పై సభా సమావేశాలు వాడీ వేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంపై చర్చించడానికి మొదటి రోజు చర్చకు నిర్దేశించిన ఇతర అన్ని అంశాలను వాయిదా వేయాలని కాంగ్రెస్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏకిపారేయాలని కాంగ్రెస్ పార్టీ సన్నద్దమవుతుండగా.. మరోవైపు ప్రతిపక్షాల అస్త్రాలను ఎలా తిప్పికొట్టాలా అనే దిశగా అధికార పక్షం వ్యూహాలు రచిస్తుంది. అంతేకాదు కరువు పరిస్థితిపై కూడా చర్చలు జరపాలని పలువురు కోరుతున్నారు. దీంతో సోమవారం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రగడ తప్పదని స్పష్టమవుతోంది. మరి ఎన్డీఏ సర్కారు ప్రతిపక్షాల విమర్శలను ఎలా ఎదుర్కుంటుందో చూడాల్సిందే.






