పాక్ ప్రతీకారం.. 8మంది ఉద్యోగులపై ఆరోపణలు..


భారత్ పై పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకోవడంలో ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టేట్టు కనిపించడంలేదు. ఇప్పటికే భారత్ లో పనిచేస్తూ గూఢాచార్య చేస్తున్న నేపథ్యంలో పాక్ ఉద్యోగిని విధుల నుండి బహిష్కరించిన సంగతి తెలిసిందే. దానికి పాక్ కూడా వెంటనే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇప్పుడు తాజాగా ఇస్లామాబాద్ లోని భారత దౌత్య కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది భారత హై కమిషన్ అధికారులు పాక్ కు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపిస్తుంది. దీనిపై విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పందిస్తూ.. కేవలం ప్రతీకారం తీర్చుకోవడానికే  ఈ ఆరోపణలు చేస్తుందని అన్నారు. కేవలం ఒక్క పాక్ జాతీయుడినే భారత్ బహిష్కరించిందని గుర్తు చేసిన ఆయన, పాక్ ఎనిమిది మంది భారత ఉద్యోగుల గుర్తింపును బహిర్గతం చేసిందని, దీని వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంటుందని.. పాకిస్థాన్ లో ఉన్న భారత ఉద్యోగులు, వారి కుటుంబీకులందరి రక్షణ బాధ్యత ఆ దేశానిదేనని ఆయన స్పష్టం చేశారు.