టిడిపి నుంచి పీలా శ్రీనివాస్ సస్పెన్షన్

 

 

 

 

విశాఖ తెలుగు తమ్ముళ్ల పై టిడిపి అధిష్టానం కన్నెర్ర జేసింది. విశాఖ జిల్లా పెందుర్తిలో ఎన్టీఆర్ వర్థంతి సభ రసాభాసగా మారింది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మీద పీలా శ్రీనివాసరావు వర్గం దాడి చేసింది.

 

బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అతికష్టం మీద అక్కడి నుండి తప్పించారు. ఈ వ్యవహారంపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పీలా శ్రీనివాస్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.



సత్యానారాయణ మూర్తి మీద దాడి చేసిన విషయం తెలియగానే హీరో బాలకృష్ణ ఆయనను ఫోన్ లో పరామర్శించారు. వెంటనే పార్టీ నేతలను సంఘటనపై విచారణకు ఆదేశించారు. బాలకృష్ణ చొరవ మూలంగానే పీలాను పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.