రైల్వే ప్రయాణికులకు ఊరట... 500, 1000 నోట్లు అనుమతి...

 

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రయాణికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక నోట్ల రద్దు కారణంతో ప్రయాణాలు సైతం రద్దు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు రైలు ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. 500, 1000 రూపాయల నోట్ల రద్దుపై ఇండియన్ రైల్వేస్ సానుకూల నిర్ణయం తీసుకుంది. రైల్వే రిజర్వేషన్లు, టికెట్ల కొనుగోలు, రైల్వే క్యాటరింగ్ సర్వీసుల్లో పాత నోట్లను తీసుకోవాలని నిర్ణయించారు. రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్లను ఈ నెల 24 వరకు అనుమతించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. నోట్లు రద్దు చేసేముందు పెట్టిన గడువు ఈరోజు రాత్రితో ముగియనుంది. దీంతో తాజాగా దానిని ఈ నెల 24 వరకు పొడిగించారు.