నిర్భయ డాక్యుమెంటరీపై హోంమంత్రి వివరణ...

నిర్భయ డాక్యుమెంటరీపై రాజ్యసభలో ఆందోళన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. డాక్యుమెంటరీ ప్రసారంపై ఆంక్షలు విధిస్తూ చర్యలు తీసుకున్నామని తెలిపారు. జైలులో ఈ తరహా ఇంటర్వ్యూలకు అనుమతులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... నిర్బయ డాక్యుమెంటరీపై వెంటనే చర్యలు తీసుకున్న హోం మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా హోం మంత్రికి అభినందనలు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.