నాగం, మోత్కుపల్లి చమత్కారం వేడెక్కి౦ది

 

 

Nagam Janardhan Reddy, motkupalli narasimhulu, Nagam Janardhan Reddy chandrababu

 

తెలంగాణ నగారా సమితి నేత నాగం జనార్ధన్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఒకరినొకరు దూషించుకునే దాకా పరిస్థితి వెళ్లింది. అసెంబ్లీలో ఎదురుపడ్డ మోత్కుపల్లితో నాగం తెలంగాణ ద్రోహులతో తాను మాట్లాడనని, బాబు కాళ్లవద్ద పడి ఉన్నారని అన్నారు. తొమ్మిదేళ్లు మంత్రి పదవిని బాబు కాళ్ల వద్ద ఉండే అనుభవించావని మోత్కుపల్లి ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. నాగంకు ఇంకా దొరతనం పోలేదని అన్నారు. తెలంగాణ అంశం మీద చంద్రబాబు మోసం చేస్తున్నాడని అన్నారు. తొమ్మిదేళ్లు బాబుతో ఉండి అలా అంటావా అని మోత్కుపల్లి అనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. మొదట చమత్కారంగా ఆరంభమైన మాటల పర్వం క్రమేపి వేడెక్కి ఒకరినొకరు దూషించుకునే వరకు వెళ్లింది.