ములాయంసింగ్‌ని పిచ్చాస్పత్రిలో చేర్పిస్తే బెటరట!

 

 

 

యు.పి. మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ రకరకాల వెరైటీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. లేనిపోని సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ములాయం సింగ్ యాదవ్‌ని పిచ్చాస్పత్రిలో చేరిస్తే మంచిదని యు.పి. మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి అభిప్రాయపడ్డారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడే ములాయంసింగ్ యాదవ్ మాయావతి మీద కూడా కొంటె కామెంట్లు చేశాడు. ఫైజాబాద్‌లో జరిగిన ఒక ర్యాలీలో ములాయం మాట్లాడుతూ, ‘మాయావతిని మిస్ అనాలో, మిస్టర్ అనాలో, సిస్టర్ అనాలో నాకు అర్థం కావడం లేదు’ అని వెటకారంగా మాట్లాడాడు. ఈ కామెంట్లపై మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ములాయం మతి భ్రమించి ఇలా అడ్డమైన కూతలు కూస్తున్నాడని, ఆయన్ని అర్జెంటుగా పిచ్చాస్పత్రిలో చేరిస్తే మంచిదని అన్నారు. ఈసారి ఎన్నికలలో తాను ఓడిపోతాననే భయం ములాయాన్ని పట్టి పీడిస్తోందని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని మాయావతి మండిపడింది.