పది మంది ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

 

 

MLC elections, tdp congress, congress trs, ysr congress bjp

 

 

శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మొదట కాంగ్రెస్ నుంచి ఆరో అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించుకున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చివరి నిమిషంలో రద్దు చేసుకోవడంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైనట్లే. టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, మహ్మద్ సలీం, శమంతకమణి, కాంగ్రెస్ నుంచి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, కొలగట్ల వీరభద్రస్వామి, లక్ష్మీశివకుమారి, సంతోష్‌కుమార్, టీఆర్‌ఎస్ నుంచి మహ్మద్ అలీ, వైఎస్సార్‌సీపీ నుంచి ఆదిరెడ్డి అప్పారావు ల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.