ఆ విషయంపై మీరా గరం గరం

 

 

 

లోక్ సభలో తెలంగాణా కాంగ్రెస్ యంపీలను అడ్డుకొనేందుకు యంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే వాడిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పీకర్ మీరాకుమార్ స్పందించారు. దీనికి సంబంధించిన విషయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆమె సభాహక్కుల కమిటీకి నివేదించారు. సభా వ్యవహారాలు, ప్రవర్తనా నియమావళిలోని 227 నిబంధన కింద ఆమె ఈమేరకు నివేదించారని లోక్ సభ సెక్రటేరియట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇలాంటి పరిణామాలు మరోసారి జరగకుండా భద్రత కమీటి అత్యాధునిక సాంకేతిక పరికరాలను, మెటల్ డిటెక్టర్లను అమర్చారు. ప్రతిఒక్కదానినీ తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు.