టీఆర్ఎస్ లో చేరిన కొండా దంపతులు

 

 

 

తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగంగా తెలంగాణ ప్రజలు ఆకాంక్ష మేరకు ఈరోజు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరినట్లు కొండా సురేఖ ప్రకటించారు. గతంలో టీఆర్ఎస్ శ్రేణులతో వివాదాలు ఉన్న నేపథ్యంలో అదంతా రాజకీయ పరమైనవే తప్ప వ్యక్తిగతం కాదని, తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ తోనే సాధ్యం అని, గతంలో ఉన్న పరిస్థితులు, అవగాహన మేరకే కేసీఆర్ మీద విమర్శలు చేశామని, ఇప్పుడు టీఆర్ఎస్ మూలంగానే తెలంగాణకు భవిష్యత్ అని భావించి ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చామని కొండా సురేఖ వెల్లడించారు. పార్టీలు మారడంపై మీడియా అడిగిన ప్రశ్నకు జర్నలిస్టులుగా మీరు అవకాశాలను బట్టి ఛానళ్లు, పత్రికలు మారినట్లే తాము పార్టీలు మారామని, తాము పదవుల కోసం పార్టీలు మారలేదన్న విషయం గుర్తు పెట్టుకోవాలని సురేఖ గుర్తు చేశారు.


మరోవైపు వరంగల్ జిల్లాలో కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలు కొండా దంపతుల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.ఒక కార్యకర్త అయితే కిరోసిన్ మీద పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో కెటిఆర్ అయిందేదో అయిపోయింది..అంతా కలిసి పనిచేద్దామని కెటిఆర్ పిలుపు ఇచ్చారు.