టీఆర్ఎస్ లోకి 8 మంది ఎంపీలు,ఎమ్మెల్యేలు

 

kcr telangana, trs kcr, kcr telangana issue

 

 

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో శనివారం జరుగుతున్న టీఆర్ఎస్ 13వ ఆవిర్భావ సభలో కేసీఆర్ ప్రసంగించారు. త్వరలోనే ఏడు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మే నెల చివరి వరకు మిగతా పార్టీలన్నీ ఖాళీ అవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ నేతల రంగు బయట పడిందని, ఉద్యమం కొనసాగిస్తూనే రాజకీయశక్తిగా ఎదగాలని కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కొంత మంది తెలంగాణ నేతలే తెలంగాణకు అడ్డంకిగా ఉన్నారని కేసీఆర్ ఆరోపించారు. ఇప్పటి వరకు తెలంగాణ కోసం చాలా ఉద్యమాలు, నిరసనలు చేపట్టినప్పటికీ ఫలితం దక్కలేదని, అయినప్పటికీ తమ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం చేసిన వాగ్ధానాలను నిలుపుకోవాలంటే ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.వరుసగా ఏడోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడుగా కేసీఆర్ ఎన్నికయ్యారు.