ఎన్టీఆర్ టిడిపి చచ్చిపోయింది

 

 

kcr chandrababu, kctr tdp, kcr telangana

 

 

ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. టీడీపీ నిర్ణయంతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని ఆయన అన్నారు. అధికార పక్షానికి ప్రధాన ప్రతిపక్షం మద్ధతు ఇవ్వడమన్నది ప్రపంచంలో ఇదే ప్రథమం అని కేసీఆర్ తెలిపారు. అసలు అవిశ్వాసాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడపీ ప్రవేశ పెడుతుందనుకున్నమని, కానీ అలా చేయకపోవడంతో తమతో అయినా కలిసి వస్తుందని అవిశ్వాసం పెట్టామని కేసీఆర్ తెలిపారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలమో, వ్యతిరేకమో ఏప్రిలో మొదటి వారంలోగా తేలిపోతదని కేసీఆర్ అన్నారు. ఇక అవిశ్వాసంపై ఓటు వేయకపోవడం అన్నది ఎంఐఎం నేతల విజ్ఞతకే వదిలివేస్తున్నామని కేసీఆర్ చెప్పారు.