కావూరి బీజేపీలో చేరడం ఖాయం: మే 1న పార్టీ తీర్థం

 

 

 

పాపం కావూరికి ఎట్టకేలకి బీజేపీలో ఎంట్రీ దొరుకుతోంది. చేయాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేయకుండా ఆ తర్వాత ఎప్పుడో తన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత కావూరి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. వెంటనే బీజేపీలో చేరిపోయి ఎన్నికలలో పోటీ చేయాలని అనుకున్నప్పటికీ బీజేపీ నుంచి ఆయనకి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పుడ మా పార్టీలో చేరితో తమరికి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలి. అలా ఇస్తే తమరి పుణ్యమా అని సీమాంధ్రలో మా పార్టీ గల్లంతయిపోయే ప్రమాదం వుంది. అంచేత మీకు ఇప్పుడే పార్టీ తీర్థం ఇవ్వబోమని బీజేపీ నాయకత్వం క్లియర్‌గా చెప్పేసింది. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ అప్లికేషన్ పరిశీలిస్తామని చెప్పింది. ఆ ప్రకారంగా కావూరి బీజేపీలో చేరడానికి బీజేపీ ఇపుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ ఓకే అనడంతో బతుకుజీవుడా అనుకున్న కావూరి బీజేపీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మే 1న పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్డీయే మిత్రపక్షాల సభలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమక్షంలో బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.