టిడిపి కి జెసి బ్రదర్స్ షాక్

 

 

 JC Brothers TDP, TDP JC Brothers, chandrababu JC Brothers

 

 

మహబూబ్‌నగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూల్ టీడీపీ ఇంఛార్జి జెసి బ్రదర్స్ అధినేత మర్రి జనార్థన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణపై టిడిపిలో స్పష్టత లేదని భావించిన మర్రి జనార్ధన్ రెడ్డి తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు పంపారు. జనార్ధన్ రెడ్డి ఈరోజు సాయంత్రం తన భవిష్యత్ కార్యాచరణను కటించనున్నారు. ఉప ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ టిడిపి అభ్యర్థిగా మర్రి జనార్ధన్‌రెడ్డి పోటీ చేశారు. ఆయన నాగం జనార్థన్ రెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే.