జగ్గా రెడ్డి సమైఖ్య వాది !

 

 

 

 

 


కాంగ్రెస్ నేత, శాసనసభ్యుడు జగ్గా రెడ్డి తాను సమైఖ్య వాదినంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, సమైఖ్య ఆంధ్ర తోనే తెలంగాణా అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.

 

ఎంఐఎం పార్టీ కూడా ఇదే అభిప్రాయంతో ఉందని ఆయన అన్నారు. దమ్ముంటే, ఒవైసీ సోదరులను ముట్టడించాలని జగ్గా రెడ్డి తెలంగాణా లాయర్లను సవాల్ చేశారు. తెలంగాణా లాయర్లు కొందరు కెసిఆర్ కు తొత్తులుగా మారారని ఆయన విమర్శించారు. తెలంగాణా రాష్ట్రం వద్దని తాను కేంద్రానికి, తమ పార్టీ అధిష్టానికి లేఖ రాస్తానని ఆయన ప్రకటించారు.

 

గతంలో, ప్రత్యెక తెలంగాణా రాష్ట్ర డిమాండ్ తో టిఆర్ఎస్ నుండి సంగా రెడ్డి శాసనసభ్యునిగా ఎన్నికైన జగ్గా రెడ్డి ఇప్పుడు తెలంగాణా కు వ్యతిరేకంగా మారడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఆయన ఈ ప్రకటన సమైఖ్య ఆంధ్రులకు మాత్రం ఆనందాన్ని కలిగిస్తోంది.