భారత్ 455 ఆలౌట్..


 

విశాఖలో భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా తడబాటుతో వరుస వికెట్లు కోల్పోయి కేవలం 455 పరుగులకు ఆలౌటైంది. నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇండియా భారీ స్కోరునే సంపాదించింది. అయితే ఈరోజు మాత్రం పేలవమైన ప్రదర్శనతో కేవలం 138 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్ సన్, అలీలకు 3 వికెట్ల చొప్పున దక్కగా, రషీద్ 2 వికెట్లు, బ్రాడ్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. మరికాసేపట్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది.