భార‌త్ 488 ఆలౌట్..

 

రాజ్ కోట్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్.. తొలి ఇన్నింగ్స్ ముగిసింది.  తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు జరుగుతున్న మ్యాచ్లో భార‌త్ 488 ర‌న్స్ చేసి ఆలౌటైంది. ఏడు బౌండ‌రీల‌తో 70 ర‌న్స్ చేసిన అశ్విన్ నాలుగ‌వ రోజు కీల‌క పాత్ర పోషించాడు. కాగా ఇంగ్లండ్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 49 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. షమీ 8 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ నాలుగు, మొయిన్ అలీ, అన్సారీ రెండేసి వికెట్లు తీసుకున్నారు. కాగా మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 537 పరుగులు తీసిన సంగతి తెలిసిందే.