బోర్డర్‌లో కాల్పులు: పాకిస్థాన్ బుద్ధి వంకర!

 

అందరూ కుక్కతోక వంకర అని అంటూ వుంటారుగానీ, నిజానికి అనాల్సింద పాకిస్థాన్ బుద్ధి వంకర అని! కుక్కతోకకున్న వంకర్ని సరిచేయొచ్చేమోగానీ, పాకిస్థాన్ వంకర బుద్ధిని సరిచేయడం మాత్రం ఆ దేవుడి వల్ల కూడా కాదు. నిన్న మొన్నటి వరకూ పాకిస్థాన్ నాయకులు స్నేహహస్తం అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చారు. నవాజ్ షరీఫ్ అయితే మోడీ తల్లికి చీరను కూడా కానుకగా పంపాడు. ఇంతలోనే పాకిస్థాన్ బుర్రలో ఏం పురుగు పుట్టిందోగానీ, కాశ్మీర్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు పాకిస్థాన్ సైనికులు సరిహద్దులో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక భారత సైనికుడు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు సైనికులు కాగా, నలుగురు స్థానిక పౌరులు.