పాక్ మరో దుస్సాహసం...

 

భారత్-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో భాగంగా ఈరోజు పాక్ మరో దుస్సాహసం చేసింది. అదేంటంటే..సరిహద్దుల వెంబడి సైనిక విన్యాసాలు చేస్తోంది. అంతేకాదు ఈ విన్యాసాలు పర్యవేక్షించడానికి స్వయంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫే అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ కూడా హాజరయ్యారు. హెలికాప్టర్ గన్‌షిప్‌లు, పదాతి దళాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏదైనా అవాంఛిత పరిస్థితి వస్తే తమ సైన్యం దాన్ని ఎదుర్కోడానికి ఎంతవరకు సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఈ సైనిక విన్యాసాలు సూచిస్తాయని పాక్ భద్రతా అధికారులు చెబుతున్నారు. తమపై దాడి జరిగితే కాపాడుకోగల సామర్థ్యం ఉందన్నారు.