గుజరాత్‌ అల్లర్లపై మోడీ స్పందన

 

 

 

గోద్రా అల్లర్లపై గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ స్పందించారు. గుజరాత్‌లో 2002లో జరిగిన మత ఘర్షణలు బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. బ్రిటన్ కు చెందిన టీవి నిర్మాత, రచయిత ఆండీ మారినో రాసిన 'మోడీ రాజకీయ జీవిత చరిత్ర' పుస్తకంలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. గోద్రా అల్లర్లలో తన ప్రమేయం లేకపోయినా..తన ప్రమేయం వున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరిగిందని మోదీ వాపోయారు. అల్లర్లు జరిగినప్పటి నుండి పన్నెండేళ్ల పాటు తాను అన్ని వైపుల నుండి విమర్శలను ఎదుర్కొన్నానని, అయితే మీడియా తన పని తాను చేసుకోనివ్వాలని, ఎలాంటి ఘర్షణ పెట్టుకోకూడదని తాను ముందే నిర్ణయించుకున్నానని చెప్పారు. అల్లర్ల తర్వాత మోడీ ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకోవాలని అనుకున్నారని, అయితే పార్టీ, గుజరాత్ ప్రజలు ఒత్తిడి చేయడంతో పదవిలో కొనసాగినట్టు పుస్తకం వెల్లడించింది.