కాంగ్రెస్ నేతపై దుండగుల కాల్పులు..

 

హర్యానాలో కాల్పుల కలకలం రేగింది.  ఓ కాంగ్రెస నేతపై కాల్పులు జరిపిన ఘటన అందరికి దడ పుట్టించింది. వివరాల ప్రకారం.. హర్యానాలోని రోహ్ తక్ లో మార్నింగ్ వాక్ కోసం వచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నేత అశోక్ కాకా పై దుండగులు కాల్పులు జరిపారు. అశోక్ కాకానే టార్గెట్ చేసిన దుండగులు కళ్లు మూసి తెరిచేలోగానే ఆయనపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.