కాంగ్రెస్ లో చేరిన గజల్ శ్రీనివాస్
posted on May 12, 2013 3:18PM
ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, పార్టీ ఇతర నేతలు పాల్గొన్నారు. తన తాత, తల్లి స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ చేరినట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. లగడపాటి రాజగోపాల్ కు సన్నిహితుడు అయిన గజల్ శ్రీనివాస్ తెలంగాణ – సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో లగడపాటి నిరహారదీక్ష చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఓ గీతం రచించాడు. దానిని లగడపాటి అన్ని ఛానళ్లలో ప్రత్యేకంగా ఉపయోగించుకున్నాడు. విజయవాడలో లగడపాటి సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ పార్టీని వీడి జగన్ పార్టీలో చేరడంతో ఆ లోటును భర్తీ చేసేందుకు గజల్ ను పార్టీలోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.