గంగానదిలో బస్సు బోల్తా.. 9 మంది దుర్మరణం

 

 

 

50 మంది ప్రయాణికులతో వున్న బస్సు గంగానదిలో పడిపోవడంతో తొమ్మిది మంది మరణించారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రి జిల్లాలోని సంకింధార్ వద్ద ఢిల్లీ నుంచి గుప్తాక్షికి వెళ్తున్న బస్సు అదుపు తప్పి గంగానదిలో పడిపోయింది. మూడు వందల మీటర్ల నుంచి ఈ బస్సు గంగానదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది.