టీ టీడీపీ.. అనుకున్నదే జరిగింది..

తెలంగాణ టీడీపీకి అనుకున్నదే జరిగింది. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అలా టీఆర్ఎస్ లోకి చేరారో లేదో.. మరో ఎమ్మెల్యే కూడా వారి దారిలోనే టీడీపీ నుండి టీఆర్ఎస్ లోకి చేరారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి నిన్ననే టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. అయితే ఇదేమి అంత షాకింగ్ న్యూసేం కాకపోవచ్చు. ఎందుకంటే ఎర్రబెల్లి టీఆర్ఎస్ లోకి చేరుతూనే తనతో పాటు ఇంకా కొంతమంది నేతలు వస్తారు అని ముందే హింట్ ఇవ్వడంతో అందరూ ఆతరువాత ఎవరు టీడీపీని విడతారా అని ఆసక్తిగా చూశారు. ఇక అందరి ఎదురుచూపులకు తెర దించుతూ రాజేందర్ రెడ్డి కారెక్కేశారు. కాగా ఇప్పటికే 15 మంది ఎమ్మెల్యేలలో 10 మంది టీఆర్ఎస్ లోకి చేరారు. ఇంకా ఐదుమంది మాత్రమే ఉన్నారు.

మరోవైపు ఎర్రబెల్లి దయాకర్ స్పీకర్ మధుసూధనాచారికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నామంటూ.. టీడీఎల్పీని నేతగా మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు టీఆర్ఎస్ లో విలీనమవుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.