షిండే మార్క్ స్టేట్మెంట్
posted on Jul 11, 2013 4:20PM
కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇస్తుందన్న తరువాత హోం మంత్రి షిండే మరో బాంబ్ పేల్చారు.. 12న జరిగే కోర్ కమిటీ బేటి ఏదో ఒక నిర్ణయం తప్పకుండా వెలువడుతుందని ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజల ఆశలై నీళ్లు చల్లారు..
తెలంగాణ అంశంపై చాలా రోజులుగా సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ ఇంతవరకు అధిష్టానం ఎలాంటి నిర్ణయానికి రాలేదన్నారు.. ఇది చాలా సున్నితమైన అంశం అయినందున అంత త్వరగా నిర్ణయం ప్రకటించలేమన్నారు..
షిండే ప్రకటనతో టికాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు.. కోర్ కమిటీ బేటిలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తుందన్న ఆశతో ఉన్న టీ కాంగ్నేతలుకు కోర్ కమిటీలో కీలక వ్యక్తి అయిన షిండే ప్రకటన మింగుడు పడటంలేదు.. బయటికి ఇది షిండే వ్యక్తిగత అభిప్రాయమే అంటున్నా లోపల మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు.