సిపిఐకి కేసిఆర్ మరో షాక్

 

 

 

సిపిఐ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ షాక్ మీద షాక్ లు ఇస్తున్నారు. మొదట ఆ పార్టీతో ఎన్నికల పోత్తు పెట్టుకుంటానని మాటిచ్చిన కేసిఆర్, దానిని పట్టించుకోకుండా సిపిఐ సిటింగ్ స్థానాల్లోనూ తన అభ్యర్థులను నిలబెట్టారు. తాజాగా సిపిఐ ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే చంద్రావతి కి టికెట్ ఇవ్వకుండా పార్టీ కార్యకలాపాలకు వినియోగించుకోవాలనుకున్న సిపిఐకి కేసిఆర్ మరో షాకునిచ్చారు. వైరా ఎమ్మెల్యే చంద్రావతిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు కేసిఆర్. శుక్రవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో చంద్రావతి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటూ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని ఆమె అన్నారు. కొత్తగా పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేల౦దరికీ టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో చంద్రావతికి కూడా టికెట్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.