కాంగ్రెస్ కు చావుదెబ్బ..నేతల స్పందన

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలను చూసిన కాంగ్రెస్ శ్రేణులు ఢీలా పడిపోయారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బొక్కా బోర్ల పడడంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం బోసిపోయింది. బీజేపీ నేతలు సంబురాలు చేసుకుంటుంటే కాంగ్రెస్ కార్యాలయంలో నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. కాంగ్రెస్ ఓటమికి చాలా కారణాలున్నాయని ఆ పార్టీ నేత రషీద్ ఆల్వీ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయన్ని శిరసావహిస్తామని చెబుతున్నారు. ఫలితాలపై పోస్టుమార్టం చేస్తామని అంటున్నారు.. బీజేపీ సంబరపడాల్సిందేమీ లేదంటున్నారు .. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు దీర్ఘకాలం నుంచి అధికారంలో ఉండటం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయన్నారు.రెండు రాష్ట్రాల్లో ఓటమికి ప్రభుత్వ వ్యతిరేకతే కారణమంమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా అభిప్రాయం వ్యక్తం చేశారు.